Bathing Place In Bhadrachalam Is Muddy : భద్రాచలం వద్ద పది రోజుల క్రితం భారీగా వచ్చిన గోదావరి వరదతో స్నాన ఘట్టాల ప్రాంతం మొత్తం బురదమయంగా మారింది. పది రోజుల క్రితం 56 అడుగుల వరకు పెరిగిన గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 20 అడుగుల మేర ప్రవహిస్తోంది. గోదావరి వరద వచ్చి తగ్గటంతో స్నానగట్టాల ప్రాంతం వద్ద ఒండ్రు మట్టి పేరుకుపోయింది. సుమారు అడుగు లోతు వరకు భారీగా ఒండ్రు మట్టి పేరుకుపోవడంతో భక్తులు స్నానాలు ఆచరించడానికి కొంత ప్రదేశాన్ని అధికారులు శుభ్రం చేశారు. ఇంకా చాలా మెట్లపై బురద మేటలు పేరుకుపోయి ఉంది. దీంతో ఒకవైపు నుంచి పెద్ద మోటార్ సహాయంతో బురదను శుభ్రం చేస్తున్నారు. ప్రస్తుతం తక్కువ సంఖ్యలో భక్తులు గోదావరి స్నానానికి వస్తుండటంతో ఇబ్బంది కలగడం లేదు. భక్తుల సంఖ్య పెరిగితే, గోదావరి నది వద్ద స్నానం ఆచరించడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరోవైపు బురదలో కొట్టుకు వచ్చిన చెత్తా చెదారంతో ఆ ప్రాంతం దుర్వాసన వెదజల్లుతోంది.
Comments