June Recovery Mela in Visakha : విశాఖ నగర పోలీస్ కమిషనరేట్లో ప్రాపర్టీ రికవరీ మేళా నిర్వహించారు. ఈ మేళాలో సీపీ శంఖబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొని జూన్ నెలలో వివిధ కేసుల్లో రికవరీ చేసిన కోటికి పైగా విలువైన వస్తువులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నేరాలను అరికట్టడంలో, చోరీకి గురైన సొత్తును రికవరీ చేయడంలో విశాఖ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని శంఖబ్రత బాగ్చి తెలిపారు. మొత్తం 71 కేసులకు సంబంధించి 84 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. ఈ కేసుల్లో మొత్తం 534 గ్రాముల బంగారం, 699 గ్రాముల వెండి, 470 మొబైల్ ఫోన్లు, 27 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలతో పాటు వివిధ రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీటి విలువ కోటికి పైగా ఉంటుదన్నారు. రికవరీ చేసిన వస్తువులు బాధితులకు అప్పగించటం సంతోషంగా ఉందని సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు.
Comments