Skip to playerSkip to main content
  • 10 minutes ago
Nandyala Fast Food Center Creazy Offer : షాప్ ఓపెనింగ్ అంటే సాధారణంగా ఏం చేస్తారు? నాలుగు బ్యానర్లు కడతారు, కాస్త ప్రచారం చేసుకుంటారు. లేదా చిన్నపాటి డిస్కౌంట్లు ఇస్తారు. కానీ, నంద్యాల జిల్లా డేనియల్ పురంలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్​ ఓనర్ మాత్రం రూట్ మార్చాడు. అందరిలా కాకుండా కాస్త క్రేజీగా ఆలోచించాడు. ఆ ఆలోచన ఎలా వర్కవుట్ అయిందంటే హోటల్ ముందు ఏకంగా జాతరను తలపించేలా క్యూ లైన్లు కట్టేలా చేసింది. ఆయన చేసిన ఆ మ్యాజిక్ ఏంటో తెలుసా? అక్షరాలా 2 రూపాయలకే ప్లేట్ గోబీ. అంతేకాదండోయ్ కేవలం 1 రూపాయికే ఎగ్ రైస్ ఇంకొక్క రూపాయికే నూడిల్స్. వినడానికే నమ్మశక్యంగా లేని ఈ ఆఫర్ ప్రకటిస్తే జనాలు ఊరుకుంటారా? వేడివేడి నూడిల్స్, కరకరలాడే గోబీ కోసం జనాలు ఎగబడ్డారు. ముఖ్యంగా చిన్న పిల్లలైతే గోబీ ప్లేట్ల కోసం పోటీ పడి మరీ లైన్లలో నిలబడ్డారు. రూపాయి నాణేలు పట్టుకుని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ క్యూ కట్టడంతో ఆ ప్రాంతమంతా తెగ సందడి సందడిగా మారిపోయింది.

Category

🗞
News
Transcript
00:00What
Comments

Recommended