Skip to playerSkip to main content
  • 10 hours ago
Janardhan Hills Rally : హైడ్రాకు మద్దతుగా హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ర్యాలీ నిర్వహించారు. హైడ్రా నిర్ణయాలకు అనుకూలంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ జనార్దన్‌హిల్స్‌ కాలనీ వాసులు ర్యాలీ చేపట్టారు. హైడ్రా అధికారులు ఆక్రమణకు గురైన పార్కు స్థలాన్ని రక్షించి, 3 నెలల్లో పార్కు అప్పజెప్పినట్లు తెలిపారు. జనార్ధన్​హిల్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట రమణ, సెక్రటరీ సుధాకర్, ట్రెజరర్ నవీన సహా కాలనీ వాసులందరూ ఐకమత్యంగా ర్యాలీలో పాల్గొన్నారు. రూ.కోట్ల విలువైన పార్క్​ను హైడ్రా కాపాడిందని వారంతా కొనియాడారు. పార్క్ అందుబాటులోకి రావడం వలన అన్ని వయసుల వారు వ్యాయామం చేసుకోవడానికి బాగుందని స్థానిక మహిళలు లావణ్య, రష్మి చెబుతున్నారు. గతంలో ఈ సమస్యను ఎవరికి చెప్పాలో తెలియక ఆందోళన చెందామన్నారు. కొంతకాలంగా హైడ్రా మంచి పనులు చేయడం చూసి కాలనీ వాసులందరం ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురైన విషయం స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి, హైడ్రా కమిషనర్ రంగనాథ్​కు ఫిర్యాదు చేశామని చెప్పారు. హైడ్రా టీమ్ తక్షణమే స్పందించి సమస్య పరిష్కరించిందని కాలనీవాసులు చెబుతున్నారు.

Category

🗞
News
Transcript
00:03This is a production of the U.S. Department of State.
Comments

Recommended