Laksha Pushparchana in Yadagirigutta Temple : ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు చేశారు. ఆలయ అర్చకులు ప్రధాన ఆలయంలోని ముఖమండపంలో సుమారు గంట పాటు లక్ష పుష్పార్చన పూజలు, పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ సన్నాయి మేళతాళాలతో ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది.లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు, ఆ కార్యక్రమం విశిష్టతను తెలియజేశారు. ఏకాదశి పర్వదినం కావటంతో యాదగిరిగుట్ట ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. అలాగే ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చారు. స్వామి వారి ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. ఉదయం నుంచే స్వామి వారిని దర్శించుకుని ఆర్జిత పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Comments