15 Feet Python Found in Banana Farm : అనంతపురం జిల్లా యల్లనూరు మండలం దంతెరపల్లిలో భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన భాస్కర్రెడ్డి అనే రైతు అరటి తోటలో కూలీలు పనులు చేస్తుండగా 15 అడుగుల కొండచిలువ కనిపించింది. ఒక్కసారిగా కొండచిలువను చూసిన కూలీలు భయాందోళనకు గురై పనులు నిలిపివేశారు. దీంతో స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ మధుసూదన్ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న మధుసూదన్రెడ్డి, చాలా చాకచక్యంగా ఆ భారీ కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం అటవీ శాఖ నిబంధనలకు అనుగుణంగా కొండచిలువను సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో భయాందోళనకు గురైన కూలీలు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు. "ఒక్కసారిగా భారీ కొండచిలువ కనిపించింది. దాన్ని చూడగానే కూలీలంతా భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించడంతో, ఆయన వచ్చి పామును సురక్షితంగా పట్టుకుని సమీపంలోని కొండ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ప్రాంతంలో రోజురోజుకూ పాముల బెడద బాగా ఎక్కువవుతోంది" అని రైతు భాస్కర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
Comments