Skip to playerSkip to main content
  • 6 hours ago
5 Tourists Rescue in RK Beach : విశాఖ రామకృష్ణ బీచ్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. సముద్ర తీరంలో గల్లంతవుతున్న ఐదుగురు పర్యాటకులను జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ కాపాడారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా ముషంపల్లికి చెందిన ఐదుగురు ఆర్కే బీచ్​కి వచ్చారు. సరదగా సముద్రంలో స్నానానికి దిగారు . అంతలోనే ఊహించని పరిణామం ఎదురైంది. ఒక్కసారిగా అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. బలమైన అలల ధాటికి ఐదుగురు సముద్రంలోకి కొట్టుకుపోయారు. ఒడ్డుకు వచ్చేందుకు ఆ ఐదుగురు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. వీరు ప్రాణాపాయ స్థితిలో ఉండటాన్ని జీవీఎంసీ బీచ్ లైఫ్‌గార్డ్ ధనరాజ్ గమనించారు. వెంటనే ఆయన సముద్రంలోకి దూకారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అప్రమత్తంగా వ్యవహరించి, ఐదుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అక్కడే ఉన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయం చేశారు. ఐదుగురిని అక్కడి నుంచి సురక్షితంగా పంపించి వేశారు. ఎవ్వరికీ ఏమి కాకపోవడంతో పర్యాటకులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Category

🗞
News
Comments

Recommended