Drone Catches Gamblers : కడప జిల్లా వేంపల్లి మండలం కత్తులూరు గ్రామంలో డ్రోన్ కెమెరా కంటికి ఐదుగురు జూదరులు అడ్డంగా దొరికిపోయారు. గ్రామంలోని చీని చెట్ల కింద పట్టాలు పరిచి జూదం ఆడుతున్నారు. వేంపల్లి సీఐ నరసింహులు ఆధ్వర్యంలో పోలీసులు ఆ ప్రాంతంపై దాడి చేసి, ఐదుగురు జూదరులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారి నుంచి రూ.8,990 నగదును సీజ్ చేసి, పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ నరసింహులు హెచ్చరించారు.
Comments