Skip to playerSkip to main content
  • 15 minutes ago
Goti Talambralu For Sri Rama Navami: ప్రముఖ పుణ్యక్షేత్రాలు భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్యలలో శ్రీరామనవమికి నిర్వహించే సీతారాముల కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సిద్ధం చేసే క్రతువు మొదలైంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని అచ్యుతాపురంలో వరి సాగును భక్తులు ప్రారంభించారు. భద్రాచలం రాముల వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వరి విత్తనాలను కోరుకొండ శ్రీకృష్ణచైతన్య సంఘం అధ్యక్షుడు కల్యాణం అప్పారావు ఆధ్వర్యంలో గ్రామానికి తీసుకొచ్చారు. శ్రీరాముడు, ఆంజనేయుడు, అంగదుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వేషధారణలతో రామనామ సంకీర్తనలతో పొలాన్ని నాగలితో దున్నుతూ సాగును ప్రారంభించారు.అనంతరం అప్పారావు మాట్లాడుతూ ఏటా కోటి తలంబ్రాలను సిద్ధం చేస్తున్నామని, ఇక్కడ పండిన ధాన్యాన్ని వివిధ ప్రాంతాల్లోని భక్తులకు అందించి గోటితో ఒలిపించి భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్యలకు పంపిస్తున్నామన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణంలో ఉపయోగించే అత్యంత పవిత్రమైన తలంబ్రాలు. భక్తులు భక్తిశ్రద్ధలతో బియ్యాన్ని గోళ్లతో ఒలిచి వీటిని తయారు చేస్తారు. 

Category

🗞
News
Transcript
00:06This is the reason why we are here.
00:08It is a reason why we are here.
00:10When we are here, we are here.
00:13And we are here.
00:18It is the reason why we are here.
00:21I am here.
00:48Thank you very much, Ramachandra.
00:52Thank you very much, Ramachandra.
Comments

Recommended