Skip to playerSkip to main content
  • 7 minutes ago
Nagarjuna Sagar Left Canal Opened : తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఎన్​ఎస్​పీ అధికారులు నీటిని విడుదల చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌కు ఈ జలాలు చేరుకోనున్నాయి. 500 క్యూసెక్కులతో మొదలుపెట్టి క్రమంగా నీటి విడుదలను పెంచనున్నారు. తాగునీటి అవసరాల కోసం 1 టీఎంసీ నీరు కేటాయించినట్లు ఎన్​ఎస్​పీ అధికారులు తెలిపారు. ఈ నీరు సాగర్​ నుంచి పాలేరు వరకు కాల్వ ద్వారా నీటి సరఫరా కానుంది. దాంతో కాల్వలపై ఉన్న మేజర్లకు నీటి విడుదల ఉండదని స్పష్టంచేశారు. నీరు వృథా కాకుండా చూడాలని నీటి పారుదల శాఖ అధికారులను ముందే అప్రమత్తం చేశారు. అయితే నాగార్జునసాగర్ జలాశయం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 515 అడుగులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 141.19 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి ఎలాంటి వరద లేదని అధికారులు పేర్కొన్నారు. 

Category

🗞
News
Transcript
00:22Thank you for joining us.
00:45Thank you for joining us.
Comments

Recommended