Natural Star Nani Visits Tirumala Temple : తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు నాని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో నాని పాల్గొన్నారు. టీటీడీ అధికారులు నానికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన నాని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసారు. ఆలయం వెలువల నానితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.31 కంపార్టుమెంట్లో వేచి ఉన్న భక్తులు : శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,139 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 34,940 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు వచ్చింది. నిన్న 3.44 లక్షల లడ్డూ ప్రసాదాలు విక్రయించారు.
Comments